Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కొలుకుల జగన్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించేలా కృషి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని మైసమ్మనగర్లో రూ.28 లక్షలతో పెండింగ్లో ఉన్న భూగర్భ డ్రయినేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్లోని ప్రతి కాలనీ, బస్తీలలో సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజుల సహకారంతో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరుస్తానన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకవస్తే త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, మైసమ్మనగర్ కమిటీ అధ్యక్షులు హనుమంతు, నాయకులు రాజశేఖర్చారి, కుర్మారెడ్డి, వివేక్, ఉప్పలయ్య, వెంకటేష్, ముఖేష్, బ్రహ్మనందంచారి, బాబురావు, అప్పిరెడ్డి, పాపిరెడ్డి, బిసి సంఘం ఉపాధ్యక్షులు బాబుగౌడ్, నాయకులు విఠల్ ముదిరాజ్, లక్ష్మణ్, ఆంజనేయులు, విఘ్నేష్, గిరి, సతీష్ పాల్గొన్నారు.