Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట డివిజన్లో నూతన బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ ఇ. విజరు కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రేమ్ నగర్, సునేర్ బౌలీలో నూతన బస్తీ దవాఖాన పనులను పరిశీలించారు. బస్తీల్లో నిరుపయోగంగా ఉన్న గోడలను తొలగించారు. కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు మోహిన్ హుస్సేన్, సాహెద్, సత్తయ్య గౌడ్, నరసింహులు, పండరి, యాదగిరి, వెంకట్ నర్సిగౌడ్, చంద్రయ్య, నరసయ్య, అంజయ్య, సలీం, జయరామ్, టీఆర్ఎస్ నాయకులు జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, తిరుపతి, గౌస్, నాగరాజు, ఉదరు గౌడ్, సంతోష్ చారి, ఫ్యూరన్, జీషన్ తదితరులు పాల్గొన్నారు.