Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రవ్యాప్తంగా ఏడు యూనివర్సిటీలో వివిధ రకాలైన పీజీ కోర్సులలో అడ్మిషన్ల కోసం ఓయూ ఆధ్వర్యంలో సీపీజీఈటీ -2021 ప్రవేశ పరీక్షలు నిర్వహించి గురువారం ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా శుక్రవారం ఓయూ పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీజీఈటీ-2021 కన్వీనర్ ప్రొ. పాండురంగా రెడ్డి మాట్లాడుతూ ప్రవేశ పరీక్షల్లో అర్హతలు సాధించిన అభ్యర్థులు ఈనెల 24 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 27 నుంచి వెబ్ ఆఫ్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని సూచించారు. ఈసారి విద్యార్థులు సమర్పించిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్స్ ను ఆన్లైన్ విధానంలో చెక్ చేయాలని నిర్ణయించామని, అందుకు ఇప్పటికే ఆయా యూనివర్సిటీలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ఎంపికలో తప్పని సరిగా నిబంధనలు పాటించాలని, గైడ్ లైన్స్ పూర్తిగా చదివిన తరువాత ఆప్షన్లు ఎంపికచేసుకోవాలని సూచించారు. ఎలిజిబిలిటీ కండీషన్స్ చదవకుండా ఆఫ్షన్లు ఎంపిక చేసుకుంటే తరువాత ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని ముందస్తుగానే చెప్పారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం కోసం ఓయూ వెబ్సైట్ ను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్స్ డాక్టర్ తలారి గంగాధర్, డాక్టర్ పాట్రిక్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.