Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
''మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే' అన్నా, ' మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసిచ్చాడు' అని రాసినా ఆత్రేయ మనిషి మనస్సులను తట్టి కన్నీరు తెప్పించారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. అంతర్జాల వేదికగా యువకళావహిని నిర్వహణలో శుక్రవారం ఆచార్య ఆత్రేయ శత జయంతి సంస్మరణ సభ నిర్వహించారు. నాటక కర్తగా తన రచన ప్రస్థానాన్ని ఆరంభించి సినీ గీత రచయితగా నిర్మాతగా కూడ భిన్న రంగాలను ఆత్రేయ సజించారని కొనియాడారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తన రచనకు స్ఫూర్తి శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ అని తెలిపారు. విదేసాంధ్రులు డాక్టర్ సుధాకర్ రెడ్డి, సినీ రచయిత జె.కె.భారవి లు ఆత్రేయ నాటక రచనలను విశ్లేషించారు. సంస్థ అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలుకగా కార్యదర్శి మల్లికార్జున్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా మణి శాస్త్రి నిర్వహణలోసురేఖ, విజయ శ్రీ, బాల కామేశ్వర రావు, పవన్, లలిత, అర్చన వెంకటేశ్వర రావు తదితరులు పాడిన పాటలు హత్తు కొన్నాయి. సినీ జర్నలిస్ట్ రామా రావు వ్యాఖ్యానం సందర్భోచితంగా ఉంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పూర్వ అద్యషుడు రవి కొండబోలు, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు పాల్గొన్నారు.