Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలీసుల అదుపులో 57 మంది
నవతెలంగాణ-కూకట్పల్లి
నిషేధిత గుట్కా, పాన్ మసాలాల ప్యాకెట్లతో పాటు మత్తు పదార్ధం గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టుచేశారు. మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్స్ పరిధిలో నిందితులు భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లతో పాటు గంజాయి తాగడానికి కావాల్సిన వివిధ పేపర్ స్త్రా లాంటి వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు 16 బందాలుగా ఏర్పడిన పోలీసులు కూకట్పల్లి పరిధి 65, కేపీహెచ్బీ 68, బాచుపల్లిలో 10 కిరాణా, పాన్షాప్ లపై దాడులు చేసి, లక్షల విలువైన గుట్కా, గంజాయి సామగ్రిని స్వాధీనం చేసుకుని 57 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పట్టుబడిన నిందుతులతో ఇంకోసారి ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలని ప్రమాణం చేయించారు. మరోసారి నేరం రుజువైతే ఇప్పుడు పెట్టిన రెండు సెక్షన్లతో పాటు పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్ర శేఖర్, కూకట్ పల్లి సీఐ నర్సింగ్ రావు, కెేపీహెచ్బీ సీఐ లక్ష్మీ నారాయణ, బాచుపల్లి సీఐలు పాల్గొన్నారు.