Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
పెండింగ్లో ఉన్న రూ.3,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అన్ని వసతి గృహాలకు బడ్జెట్ను కేటాయించాలని భారతీయ విద్యార్థి మోర్చా (బివిఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బీవీఎం ఆధ్వర్యంలో శనివారం హైదర్గూడలోని రాష్ట్ర కార్యాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగా ణలో విద్య, వసతి, ఉద్యోగాల కోసం మళ్లీ కొట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. రాష్ట్రంలో విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యంగా మారిందనీ, కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి దాదాపు 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ఉన్నత విద్యకు అరకొర నిధులు ఇస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. దాదాపు రూ.14 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు చదువులకు వెళ్లలేక ఉద్యోగాలు చేయలేక యాజమాన్యాల దగ్గర తమ సర్టిఫికెట్లను తీసుకోలేక నిరాశ చెంది కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బడ్జెట్ కేటాయించినప్పటికీ అది పేపర్ కి మాత్రమే పరిమితమైందనీ, చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పూజలు, పునస్కారాలు, యాగాల పేరుతో లక్షల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారనీ, సమాజాభివృద్ధికి తోడ్పడే విద్యా రంగానికి మాత్రం న్యాయం చేయలేక పోతున్నారని ఆరో పించారు. మేడిన్ ఇండియా, బంగారు తెలంగాణ అని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఇప్పట ికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయా లనీ, ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర నాయకులు రవితేజ భూంపల్లి, వంశీ లెనిన్, దశరథ్, సంకీర్త్ రాజ్, సందీప్ రాజ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.