Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 120 ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆర్.కష్ణయ్య డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్నగర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జన గణనలో కుల గణన చేపట్టాలనీ, రైల్వే బ్యాంకింగ్-ఎల్ఐసీ బీహెచ్ ఈఎల్ రక్షణ సంస్థలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయరాదనీ, బీసీ ఉద్యోగులకు ప్రమో షన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శని వారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య నాయకత్వంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నాయకులు వి.దానకర్ణచారి, నిరంజన్, కృష్ణుడు అధ్యక్షతన సెంట్రల్ కోర్టు హౌటల్లో జరిగిన సమావేశానికి 120 కేంద్ర ప్రభుత్వం ఓబీసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నాయకులు వి.హనుమంతరావు, అజీజ్ పాషా, చాడ వెంకట్రెడ్డి హాజరరై మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జన గణన పట్టికలో 34 కాలమ్స్ పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గం అన్నారు. బీసీల పట్ల ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో సోనియా గాంధీ కుల గణనపై విధాన ప్రకటన చేయాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహాయిస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2011లో సోషియో-ఎకానమిక్ సర్వే పేరుతో రూ.7 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి, ప్రత్యేకంగా గణన చేశారని గుర్తు చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలనీ, రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యాంగ పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీ లేవన్నారు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమిషన్, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియర్సన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింద న్నారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లపై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బీసీలపై చిన్న చూపు చూస్తున్నట్టు స్పష్టంగా కన్పిస్తుందన్నారు. ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఎన్సీసీ, మహిళా రిజర్వేషన్లకు లేని క్లిమిలేయర్ బీసీలకే ఎందుకు విధించారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు లాల్ కృష్ణ, నీల వెంకటేష్, కుమారస్వామి, వెంకన్నగౌడ్, రామరాజు యాదవ్, రవికుమార్ ముదిరాజ్, చంటి ముదిరాజ్, మదన సురేందర్, గణేష్, మల్లేష్, యాకయ్యగౌడ్, కమలాకర్, సుకుమార్, విజరు, చంద్రశేఖర్, శ్రీనివాస్, భాస్కర్, జయ ప్రకాష్, మట్ట జయంతి, తదితరులు పాల్గొన్నారు.