Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్
- హాస్పిటల్లో ఏర్పాట్ల పరిశీలన
నవతెలంగాణ-ధూల్పేట్
ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు ఉచిత వసతి, మూడు పూటలా భోజనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న భోజన కేంద్ర ఏర్పాటు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద రోగి సహాయకుల పట్ల తీసుకుంటున్న నిర్ణయంం వారికిి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న కేంద్రానికి కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలనిి సంబంధిత అధికారులను ఆదేశించారు.