Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అనేక విజయాలను సొంతం చేసుకుని టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైటెక్స్లో ఈనెల 25వ తేదీన జరిగే పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని తమ సొంత పార్టీగా భావించి ఎంతో ఆదరిస్తు న్నారని చెప్పారు. ఈ నేపధ్యంలో ప్లీనరీని పండుగ వాతావరణంలో నిర్వహించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి వెంట కూకట్పల్లి మాధవరం కష్ణారావు, నాయకులు గజ్జెలనగేష్, తదితరులు ఉన్నారు.