Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తొలగించిన ఓయూ సెక్యూరిటీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కార్మికులు కోరారు. వారి నిత్య ఆందోళన వ్యక్తంలో భాగంగానే శనివారం 26న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ను ఆర్ట్స్ బ్యానర్ ఎదుట ఆవిష్కరణ చేశారు. తొలగించిన సెక్యూరిటీ సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ రావాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26న జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను కలిసి తమ సమస్యలు విన్నవించి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేశారు. తర్వాత జరిగే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని కార్మికులు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్మిక సంఘం నాయకులు పోతులూరి చారి, నరసింహారెడ్డి, హుస్సేన్, స్వామి కార్మికులు చారి, పరమేశా, అయిలయ్య, రాములు పాల్గొన్నారు.