Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ సీఐ వహీదుద్దీన్
నవతెలంగాణ-బాలానగర్
అన్నిదానాల్లోకి రక్తదానం ఎంతో గొప్పదని, ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన రక్తదాతలే ప్రాణ దాతలని బాలానగర్ పోలీస్ స్టేషన్ సీఐ వహీదు ద్దీన్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో నీలోఫర్ హాస్పిటల్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్నిదానాల్లోకి రక్త దానం చాలా గొప్పదన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు, గుండె ఆపరేషన్లు చేసుకునే వారికి, తలసేమియా బాధితులకు రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తం దానం చేయాలని కోరారు. బాలానగర్ పోలీస్ సిబ్బంది విరాళంగా సేకరించిన 10 యూనిట్ల రక్తాన్ని అందజ ేశారు. అదేవిధంగా బాలానగర్ ట్రాఫిక్ పీఎస్ సిబ్బంది విరాళంగా 6 యూనిట్ల రక్తాని, బాలానగర్ టీఎస్ఎస్పీ సిబ్బంది విరాళంగా మరో 2 యూనిట్లు, బాలానగర్ క్లూస్ టీమ్ సిబ్బంది 4 యూనిట్లు, ఇతర దాతలు విరాళంగా 107 యూనిట్లు రక్తాన్ని దానం చేశారు. మొత్తం 127 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.