Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని నరసింహా రావు నగర్ లో గత నెల స్టార్మ్ వాటర్ డ్రైన్ కై 58 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి శంకుస్థాపనకు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇన్నేళ్లుగా కాలనీవాసులు వర్షపు నీళ్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈ పనులు ప్రారంభం అవడం వలన చుట్టుపక్కల ఉన్న శారదానగర్, మోహిని ఎన్క్లేవ్, సామ నగర్, తెలంగాణ పద్మావతి కాలనీ, హయత్నగర్ బస్ డిపో 1 అండ్ 2, శాంతినగర్ కాలనీలలో వర్షపు నీరు ముంపు ఉండడంతో, పనులు ప్రారంభం అవడం వలన ఉపశమనం ఉంటుందని కార్పొరేటర్ తెలిపారు, అధికారులతో మాట్లాడిన కార్పొరేటర్ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, ఏఈ విజేందర్రెడ్డి, వాటర్ బాక్స్ మేనేజర్ వాహిని, వర్క్ ఇన్స్పెక్టర్ కష్ణ, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.