Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మాధవరం రోజాదేవి
నవతెలంగాణ-కూకట్పల్లి
డ్రయినేజీ పైప్లైన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు సూచించారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ వన్, మాధవరం కాలనీ అక్షర స్కూల్ గ్రౌండ్ పక్కన జరుగుతున్న మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ ఏఈ స్వప్నతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... డివిజన్లో జరుగుతున్న డ్రయినేజీ మరమ్మతు పనుల పైప్లైన్ లెవెల్స్ సరిగ్గా చూసుకొని పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వర్క్ఇన్స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఆంజనేయులు, అంజిరెడ్డి, రాజు, రమణా రెడ్డి, చంద్రమోహన్ సాగర్, పవన్, కష్ణారావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.