Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబర్పేట నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపా యాల కల్పనకు నిరంతరం కషి చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శనివారం గోల్నాక డివిజన్ పరిధిలోని దుర్గానగర్, జైస్వాల్ గార్డెన్లో స్థానిక అధికారులతో కలిసి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాదయాత్ర నిర్వహించి ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుర్గానగర్ బస్తీ వాసులు వర్షా కాలంలో డ్రైనేజీ నీరు పొంగడం వలన ఇబ్బందులు పడుతున్నా మని, సీసీ రోడ్డు వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టడం వంటి పలు సమస్యలను దష్టికి తీసుకురాగా, వెంటనే సానుకూలంగా స్పందించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బోరు, డ్రయినేజీ పైప్ లైన్ వేయిస్తానని, అలాగే ఇతర సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా కషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డిఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ పార్టీ గోల్నాక డివిజన్ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, స్థానిక నాయకులు శేఖర్, వినోద్, సంతోష్, బస్తీవాసులు అంజయ్య, శంకర్, పర్వతాలు, కనకయ్య, రాములు, సత్య నారాయణ, రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.