Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఏఎస్ రావునగర్ జపనిస్ పార్కులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రిజర్వేషన్ల వల్లే దళితులు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, సీపీఐ నాయకులు వీఎస్ బోస్, కాలనీ అధ్యక్షుడు విజరు కుమార్, కార్యదర్శి సోమయ్యచారి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావనీరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కాసం మహిపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.