Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డంకిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మారాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం తుర్కయాంజల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రొక్కం భీంరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంజాపూర్లోని సర్వే నెంబర్ 126లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు నాసిరకంగా ఉన్నాయనీ, ఇలాంటి వాటిని పేదలకు ఇచ్చి ఎవరి ప్రాణాలను బలిగొనేందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. భారీ వర్షాల వల్ల తుర్కయంజాల్ మున్సిపా లిటీ అతలాకుతలమైందనీ, అన్ని కాలనీలు నీట మునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు ధనదాహంతో భూములను కొల్లగొట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాల్సింది పోయి... ఉన్న నిధు లను కూడా ఖర్చు చేసుకోనివ్వకుండా అడ్డుపడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇప్పటివరకు తుర్కయంజాల్ మున్సిపాలిటీకి ఎన్ని ప్రత్యేక నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు వంటి నేతలు వారి పరిధిలోని మున్సిపాలిటీల అభివద్ధికి రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తుంటే కిషన్రెడ్డికి ఆ ధ్యాసే లేదని విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో భూములమ్మి హుజూరాబాద్ ఎన్నికల్లో పెడుతు న్నారనీ, ఈ అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నిం చారు. ఈ సమావేశంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్గౌడ్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోసికె ఐలయ్య, మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కౌన్సిలర్స్ కాకుమాను సునీల్, కుంట ఉదయశ్రీ గోపాల్రెడ్డి, కంబాలపల్లి ధనరాజ్, బొక్క రవీందర్రెడ్డి, మేతరి అనురాధ దర్శన్, కొండ్రు మల్లేష్, నాయకులు రొక్కం శేఖర్ రెడ్డి, మర్రి మహేందర్రెడ్డి, వంగేటి గోపాల్రెడ్డి, నారని శేఖర్గౌడ్, రేవెల్లి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.