Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
అర్హులైన ప్రతీ ఒక్కరూ ఆసరా ఫించన్ల కోసం నమోదు చేసుకోవాలని తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కందాడ సురేందర్రెడ్డి సూచిం చారు. ఆసరా, వృద్ధాప్య పింఛన్ కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం నియొజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు కందాడ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తుర్కయంజాల్ మున్సిపాల్టీలోని 8, 9వ వార్డుల పరిధిలో 57 ఏండ్లు దాటిన వారు ఆసరా ఫించన్లు నమోదు చేసుకోవాలని కోరుతూ ఇంటింటికీ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా 120 మంది వృద్ధులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నార న్నారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల మున్సిపాలిటీ 9వ వార్డు అధ్యక్షులు ధనుంజరుగౌడ్, ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్, ప్రణరు కుమార్, టీఆర్ ఎస్వీ అధ్యక్షులు గణేష్, టీఆర్ఎస్ నాయకులు మర్రి తిరుమల్రెడ్డి, భారత్రెడ్డి, రాజేందర్రెడ్డి. రాజుచారి, సురేష్ కురుమ, సీహెచ్ పవన్, డి.గణేష్, పి.సురేష్, ముదిరాజ్, ఎస్.సురేష్, డి.అనిల్ కుమార్, ఎండీ ఇర్షాద్, జి.తురుమలేష్, ఎమ్.తరుణ్, ఎస్.శివ కిరణ్, కె.శివకుమార్, ఎన్.శ్రీనివాస్, హరీష్, అభిషేక్, మహేందర్, శ్రీ హర్ష, రాజా, ఏన్ శ్రీహరి, ఎమ్ శ్రీకాంత్, బి.శివ, తదితరులు పాల్గొన్నారు.