Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
టీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షునిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా సోమవారం రామిడి కలావతీనగర్ కాలనీ అసోసియేషన్ అద్వర్యంలో రామిడి రాంరెడ్డిని కాలనీ వాసులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా రాంరెడ్డి మాట్లాడుతూ అల్మాస్ గూడ సర్పంచ్గా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా నిరంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ఉపాద్యక్షులు టి.సాయి కుమార్, కోశాధికారి ఎం.మోహన్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సత్యనారాయణ, బాలాజీ, రామకృష్ణ, సుమన్, తదితరులు పాల్గొన్నారు.