Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ సర్వే నెంబర్ 57లో రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా అధికా రులు పట్టించుకోవడం లేదని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కాంగ్రెస్ యువజన నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అస్లాం ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకుడు అయూబ్ఖాన్, కూకట్పల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు వి.అరవింద్ కిషోర్ నాయుడు, కంటోన్మెంట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బద్దం బల్వంత్రెడ్డి, కిరణ్, అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ హస్మత్పేట్ చెరువు పక్కనే ఉన్న దోబీ ఘాట్ సర్వే నెంబర్ 57 ప్రభుత్వ స్థలం కబ్జా చేసుకుని రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయంలో సంబంధిత అధికారి బాలానగర్ నగర్ మండల తహసీల్దార్ తదితర అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఆధారాలతో సహా భూ కబ్జా అక్రమ నిర్మాణాల విషయంపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, లేనిపక్షంలో తాము ఆందోళనకు చేస్తామని హెచ్చరించారు.