Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
టీఆర్ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇన్చార్జి (కన్వీనర్)గా గుండా నిరంజన్ను నియమిస్తూ మల్కాజి గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం నిరంజన్కు నియామకపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో మీడియా కన్వీనర్లుగా పనిచేసి ఎన్నో సేవలు అందించారనీ, ఇకముందు కూడా నియోజకవర్గ ప్రజలు, మీడియా మిత్రులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మరి ఎన్నో సేవలు చేయాలనీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని కోరారు. గుండా నిరంజన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, పార్టీలక తీతంగా నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ననీ, మీడియా మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే వెంటనే నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ మీడియా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు.