Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా లీడ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ ఠాగూర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
లోన్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ ఠాగూర్ కోరారు. నేడు సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్ వద్ద ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ రుణ విస్తరణ కార్యక్రమంలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన గృహ, వ్యాపార, వాహన, పంట, విద్యారుణాలకు సంబంధించి రుణాలు తిరిగి చెల్లింపు, వడ్డీ చెల్లింపు వివరాలపై బ్యాంకర్లు ప్రజలకు అవగాహన కలిపిస్తారని ఆయన చెప్పారు. బ్యాంకుల ద్వారా ప్రజలు ఎలాంటి రుణాలు పొందడానికి అవకాశం ఉండడంతో పాటు ఏవిధంగా తీసుకోవాలనే అంశంపై బ్యాంకర్లు ప్రజలకు వివరించనున్నారు. నగరంలోని అన్ని ప్రయివేటు, ప్రభుత్వరంగ బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.