Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ దోహదం చేస్తుందని మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి అన్నారు. మంగళవారం నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే పురంలో 178 మంది పోలీసులతో ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారు, 10 మంది అనుమానితులు, ఒక రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకు న్నామన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ చీకటి పడగానే రైల్వే స్టేషన్లు, బ్రిడ్జిల కింద గుంపులు గుంపు లుగా చేరి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులు బస్తీల్లో తిరుగుతున్నప్పుడు పోలీసులకు సమాచారం అందిం చాలని స్థానికులకు సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చని సూచిం చారు. ఈ తనిఖీలలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ నరసింహ స్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.