Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
సులువుగా డబ్బు సంపాదించుకోవాలని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆర్గనైజర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరెడ్మెట్లోని సీపీ కార్యాలయంలో రాచకొంబ సీపీ మహేశ్ భగవత్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వాలని కొత్తపేటకు చెందిన బైరామల్ శ్రీధర్ తన నలుగురు స్నేహితులు ఉప్పల్లో నివాసముంటున్న ఆంజనేయులు, సరూర్నగర్కు చెందిన రాముగౌడ్, బోయిన్పల్లికి చెందిన చత్రపతి, చైతన్యపురికి చెందిన కళ్యాణ్ ఒక ముఠాగా ఏర్పడి గూగుల్ ప్లే స్టోర్లో క్రికెట్ లైవ్ గ్రూపు, క్రికెట్ ఎక్స్చేంజ్ గ్రూపులను డౌన్లోడ్ చేసు కొని వారికి తెలిసిన వారిని గ్రూపులలో నెంబర్లు చేసుకొని ఐపీఎల్ ట్వంటీ-ట్వంటీ మ్యాచ్లో భారీ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఆదివారం జరిగిన ఇండియా పాకిస్తాన్, వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్ న్యూజిలాండ్ మ్యాచ్లపై భారీ బెట్టింగ్లు నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగులకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అదుపులోకి తీసుకొని విచారించి వారి నుంచి రూ.14 లక్షలా 92 వేల నగదు, ఒక ల్యాప్ టాప్, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో గుంపులు గుంపులుగా చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.