Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కస్టమ్స్ విభాగం హైదరాబాద్కు చెందిన ఇద్దరు అధికారులను సీబీఐ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. ఒక వ్యక్తి ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత అతనికి బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. కాగా ఈ బెయిల్ను రద్దు చేయకుండా ఉండటానికి, తర్వాత అరెస్టు చేయకుండా చర్యలు తీసుకునేలా చూడటానికి గాను నిందితుడిని రూ. 20 వేలను కస్టమ్స్ సూపరింటెండెంటు, కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు డిమాండ్ చేశారు. తర్వాత పదివేలు ఇస్తానని నిందితుడు చెప్పడంతో అంగీకరించిన ఇద్దరు అధికారులు తమ కార్యాలయం వద్ద లంచం తీసుకుంటుండగా కాపు కాసిన సీబీఐ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అంతేగాక హైదరాబాద్లోని ఇద్దరి నివాసాలు, కార్యాలయాలలో కూడా సోదాలను నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీన పరుచుకున్నారు. అరెస్టు చేసిన కస్టమ్స్ సూపరింటెండెంటు, ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.a