Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని పరిరక్షించే విధంగా యూజీసీ చర్యలు తీసుకోవాలని ఓయూ ఏఐఎస్ఎఫ్ నాయకులు రెహమాన్ డిమాండ్ చేశారు. కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో స్టూడెంట్పై దాడిని ఖండిస్తూ మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ క్యాంపస్లలో కులాలు, మతాల పేరుతో జరిగే దాడులను అరికట్టాలని ప్రశ్నిస్తున్న ఒక మహిళా విద్యార్థినిపై దాడి చేసి, వారి గొంతు నొక్కేయాలనుకోవడం అవివేకమని అన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, వివేక్, రాజు, అనిల్, జగన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.