Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
బీసీ వ్యతిరేక వైఖరి వీడకపోతే బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం బీసీ భవన్లో ఉద్యోగ, కుల, బీసీ సంఘాల సమావేశం నిర్వహించి హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు హుజూరాబాద్ టికెట్ కేటాయించి బీసీలకు సముచిత న్యాయం చేశారన్నారు. బీజేపీ బీసీ కుల జనగణన చేయకుండా, చట్టసభల్లో రిజర్వేషన్ బీసీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని దుయ్యబట్టారు. దేశంలోని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుంటే బీజేపీ కులగణన చేయబోమని చెప్పడం అన్యాయమన్నారు. బీసీలు బీజేపీకి ఓట్లు వేయకూడదని పిలుపునిచ్చారు. బీసీ డిమాండ్లను నెరవేర్చకపోతే బీజేపీకి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మెన్ దానకర్ణచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారామ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ చైర్మెన్ శారద గౌడ్, కోల జనార్దన్, విజయేంద్ర సాగర్, ఉదరు, జయంతి, సుచిత్ కుమార్ పాల్గొన్నారు.