Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు, డ్రయినేజీ పనుల ప్లానింగ్లో విఫలమయ్యారని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి కృష్ణ నాయక్ అన్నారు. మంగళవారం జంగంమేట్ డివిజన్ రాజన్నబౌలి, లక్ష్మీనగర్, శివగంగా నగర్, శివాజీ నగర్, మొర్రంబాయి ప్రాంతాల్లో పర్యటించి రోడ్డు, డ్రయినేజీ వ్యవస్థ పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్నబౌలి నాలా పనులు ప్రారంభించి సుమారు మూడేండ్లు కావస్తున్నా నేటికీ పూర్తి కాలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం రోడ్డు, నాలా డ్రయినేజీ, చెత్త, మట్టి కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్న్నారు. రాజన్నబౌలి, లక్ష్మీనగర్, శివాజీ నగర్, శివగంగా నగర్, మొర్రంబాయి, ఛత్రినాక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ఇండ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. ఓల్డ్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాం అంటూ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా చూస్తే పాత పనులు ఎక్కడ పూర్తిస్థాయిలో కాలేదని, మరి కొత్తగా హామీ ఇచ్చినా అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు వాళ్ల పరిధిలో ఉన్న పాత పనులు వెంటనే పూర్తి స్థాయిలో చేయాలని, రోడ్లు, డ్రయినేజీ, చెత్త, మట్టి కుప్పలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కిషన్ రాంకుమార్, స్థానిక నాయకులు శ్రీను, బాలు, మురారి, వినోద్, శ్రీను, మహేష్ పాల్గొన్నారు.