Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
నాయీ బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్లో రూ. 250 కోట్లు నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి కేటాయిస్తామని ప్రకటించారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. ఆలయాల్లో కల్యాణ కట్టలో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులను ఆలయ ఉద్యోగులుగా గుర్తించాలి అన్నారు. దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 250 యూనిట్ల ఉచిత కరెంటు అరకొరగా అమలవుతుందని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.. నాయీ బ్రాహ్మణ కులవృత్తి పరిరక్షణకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నరసింహులు, విజరు కుమార్, కోశాధికారి రమేష్, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.