Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 39, 40వ డివిజన్లలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వాణీదేవి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు రాష్ట్రంలో నాలుగు ఆస్పత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్లు, డ్రయినేజీ, ఫంక్షన్ హాల్, మినీ కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక మేయర్ దుర్గా దీప్ లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, డీఈ గోపీనాథ్, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మాదరి సురేఖ రమేష్, రేఖ లక్ష్మణ్, గజ్జల రాం చందర్, వేముల నర్సింహా, రవి నాయక్, బాలమణి, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.