Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శామీర్పేట/మూడుచింతలపల్లి
ప్రజాసేవలో ఆత్మ సంతృప్తి ఉందని మూడుచింతలపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం జగ్గంగూడ గ్రామంలో బోల్గు చిత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్థానిక సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా ఆమె అంత్యక్రియలకు గానూ వారి కుటుంబ సభ్యులకు రూ. ఐదు వేల నగదు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో నాయకులు మురళి గౌడ్, అనిల్ రెడ్డి, శివ, సుధాకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, మల్లేష్, సత్యనారాయణ, నవీన్, శ్రీరాములు పాల్గొన్నారు.