Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పేదలను ఆదుకోవడానికి ప్యూర్ స్వచ్ఛంద ముందుంటుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి సంధ్య అన్నారు. ఈమేరకు అంబర్ పేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటైజర్, మాస్కులు, పీపీఈ కిట్టులు, సర్జికల్ బ్లౌజులు తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావంతో ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలకు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ కల్యాణ్ రాజ్, స్థానిక నాయకులు కిరణ్ కుమార్ యాదవ్, మహేందర్ రెడ్డి, వినరు తదితరులు పాల్గొన్నారు.