Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులపౖౖె చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఓయూ అడిషినల్ కంట్రోలర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన పరీక్షలో మైక్రో బయాలజీ సంబంధించిన న్యూ పేపర్ బదులు ఓల్డ్ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందికి గురి అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్తో చెప్పిన వాళ్లు పట్టించుకోక విద్యార్థులను బెదిరించి మరి ఎగ్జామ్ రాయించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. వెంటనే స్పందించి ఆడిషినల్ కంట్రోలర్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారని ఎస్ఎఫ్ఐ నేత కె.అశోక్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.