Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినూత్న పర్యావరణ ప్రాజెక్ట్గా సీఐఐ గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన రామ్కీ ఎన్విరో బుధవారం దేశంలోనే అతిపెద్ద కంప్రెస్ట్ బయోగ్యాస్ (చెత్త నుంచి వాహన ఇంధనంగా ఉపయోగించే) ప్లాంట్(సీబీజీ)ను హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ (హెచ్ఐఎంఎస్డబ్ల్యు) సైట్వద్ద ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ల్యాండ్ఫిల్ గ్యాస్ను కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ)గా మార్చడంతో పాటుగా ఆటో ఇంధనంగా వినియోగించడంపై దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రాజెక్ట్తో గ్రీన్ హౌస్ వాయువులను పర్యావరణంలోకి విడుదల కాకుండా అడ్డుకోవడంతో పాటుగా ఆటోమోటివ్ పరిశ్రమకు అవసరమైన ఇంధనాన్ని అందించడం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా రామ్కీ ఎన్విరో మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మాలిక్ మాట్లాడుతూ.. మన ఇంధన భద్రతకు ప్రాధాన్యమిస్తూనే భారతదేశపు మౌలిక వసతుల అభివృద్ధిని నిలకడగా ఏ విధంగా మార్చగలమనే ఆలోచనకు ప్రతిస్పందనగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తుందన్నారు. ఈ ల్యాండ్ఫిల్ గ్యాస్ నుంచి సీబీజీ ప్రాజెక్ట్ను వినూత్నమైన పర్యావరణ ప్రాజెక్ట్గా గుర్తించడం ఎంతో సంతోషకరమని చెప్పారు. వ్యర్థ నిర్వహణతోపాటు భారతీయ ఆటోమోటివ్ రంగాన్ని సైతం పర్యావరణ హితంగా మార్చే మరెన్నో విప్లవాత్మక ప్రాజెక్టులకు ఆరంభంగా ఈ ప్రాజెక్ట్ నిలువనుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో అతిపెద్ద డంపింగ్ యార్డులలో ఒకదానిని సస్టెయినబుల్ ఎనర్జీ, గ్రీన్ ఆటో ఫ్యూయల్ వనరుగా విజయవంతంగా మార్చడమనేది సర్క్యులర్ ఎకానమీకి అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభం గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్గార్గ్ మాట్లాడుతూ... హెచ్ఐఎంఎస్డబ్ల్యు వద్ద అతిపెద్ద బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించేందుకు రామ్కీ ఎన్విరోతో భాగస్వామ్యం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమను పర్యావరణ హితంగా మార్చడంతో పాటుగా వాతావరణంలోకి గ్రీన్ హౌస్వాయువులు విడుదల కాకుండా అడ్డుకోవడంలో ఈ ప్రాజెక్ట్ గణనీయమైన ప్రభావం చూపనుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆటోలలో పర్యావరణ అనుకూల సీబీఐ ఇంధనం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.