Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం అంబర్పేటలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముందుగా వరుసగా తొమ్మిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్కు అంబర్పేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో మలి దశ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలకు పరిపాలన చేతకాక రాష్ట్రం అంధకారమైపోతుందన్న వారందరూ ఆశ్చర్యపోయేలా ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దేశంలో రైతుల పట్ల బీజేపీ కర్కశంగా వ్యవహరిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం రైతు బంధు పథకంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల జీవనాన్ని దుర్భరం చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లాలో నవంబర్ 15న విజయ గర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో అంబర్ పేట నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబర్పేట కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పులి జగన్, పద్మావతి రెడ్డి, గరిగంటి శ్రీ దేవీ, టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్లు సిద్ధార్థ్ ముదిరాజ్, కొమ్ము శ్రీనివాస్, మేడి ప్రసాద్, భీష్మ, చంద్ర మోహన్, సీనియర్ నాయకులు డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, బద్దుల రవీందర్ యాదవ్, డాక్టర్ శిరీష యాదవ్, ఎర్ర బోలు నరసింహారెడ్డి, శ్రీరాములు ముదిరాజ్, అమునూరి సతీష్, ప్రవీణ్ పటేల్, రామారావు యాదవ్, లవంగ ఆంజనేయులు, వంజరి నాగరాజు, మహేష్ ముదిరాజ్, జాకీ బాబు, లవంగ నాగరాజు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.