Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వయస్సు ఎక్కువ ఉన్నంతమాత్రాన వారి జీవితం ముగిసినట్లుగా చాలా మంది భావిస్తారని, ఇది సరికాదని వారిలోని ప్రతిభ వెలుగు చూసేందుకు తగిన సమయమని వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ వై. శ్రీరామచంద్ర మూర్తి అన్నారు. సీనియర్ సిటిజెన్ సర్వీస్ ట్రస్ట్, వైఎస్ఆర్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో 60 ఏండ్లకు పైబడిన వారికి నిర్వహించిన పాటల పోటీలో విజేతలకు బుధవారం ట్రస్ట్ కార్యాలయంలో బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ వైస్ చైర్మెన్ నాగేశ్వర రావు మాట్లాడుతూ తమకు నచ్చిన కళను నేర్చుకోవడం, వేదికలపై ప్రదర్శిచడం వల్ల జీవితకాలం పెరుగు తుందని అన్నారు. కర్ణాటక, లలిత సంగీత పోటీల్లో 170 మంది వద్ధులు పాల్గొన్నారని మూర్తి తమ నివేదికలో తెలిపారు. ప్రథమ బహుమతి అచ్యుత, శ్రీనివాస్, రత్నమాల ఎంపిక కాగా వారిని నిత్యయువ గాన కోకిల బిరుదుతో సత్కరించారు. రెండో బహుమతి జగదాంబ, రేవతి, భాస్కర శర్మ లకు, మూడో బహుమతి రుక్మిణీ దేవి, కోమలంబ, రఘురాం మూర్తి,శోభారాణి లకు అందజేశారు.