Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవర్ గ్రీడ్ జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వర్
నవతెలంగాణ-ఘట్కేసర్రూరల్
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘనపూర్ పవర్ గ్రీడ్ సంస్థ జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వర్ అన్నారు. ఘట్కేసర్ మండలం ఘనపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం పవర్ గ్రిడ్ సంస్థ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిణామాలు భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమన్నారు. అవినీతిని అరికట్టి మెరుగైన సమ సమాజ స్థాపనకు ముఖ్యంగా యువత కృషి చాలా అవసరమని అన్నారు. అవినీతి నిర్మూలన గ్రామ స్థాయి నుండే జరగాలని, ప్రజలు అందరూ చైతన్యం అయినపుడే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, ఎంపీటీసీి గట్టగళ్ళ రవి, కార్యదర్శి మధు, వార్డు సభ్యులు వేముల పరమేష్గౌడ్, చిలుగూరి భాస్కర్, వేముల పద్మ, మందుల మయూరి, వేముల శోభ, కోఆప్షన్ సభ్యులు నానావత్ సురేష్ నాయక్, ఇన్నారెడ్డి, పవర్ గ్రీడ్ అధికారులు సత్యనారాయణ, సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు వేముల మహేష్గౌడ్, గర్జకుంట నర్సింహ్మ, మాజీ సర్పంచ్లు వేముల మమత, నానావత్ రూప్సింగ్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్యగౌడ్, నాయకులు వేముల గోవర్ధన్గౌడ్, నానావత్ శివాజీ నాయక్, వేముల శంకర్గౌడ్, మహేశ్వర్గౌడ్, కేపీఆర్ఐటి విద్యార్థులు పాల్గొన్నారు.