Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
కవి, రచయిత, గాయకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతల రాకేశ్ భవానికి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాల యం 81వ స్నాతకోత్సవం సందర్భంగా డీఆర్డీఓ చైర్మెన్, రక్షణ శాఖ కార్యదర్శి డా.జీ.సతీశ్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ల చేతుల మీదుగా బుధవారం డాక్టరేట్ పట్టాను పొందారు. ఠాగూర్ ఆడిటోరియం లో ఈ ప్రదానోత్సవం జరిగింది. ''తెలుగు సినీగేయ సాహిత్యం-సమకాలీన సమాజ చిత్రణ (1960-70)'' అన్న అంశంపై ప్రొఫెసర్ వెలుదండ నిత్యానం దరావు పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు చలనచిత్ర గీతం పుట్టుక, వికాసం మొదలుకొని 1960-70 నాటి సామాజిక పరిస్థి తులు, వీటి ఆధారంగా వచ్చిన ప్రధాన సాంఘిక చిత్రాలు, సినీ కవులు - దక్పథాలు, సినీ గేయాల్లో గ్రామీణ సమాజ చిత్రణ, నాటి సమస్యలు సినీ కవుల స్పందనలు మొత్తం ఆరు అధ్యాయాలుగా విభజించి పరిశోధన పూర్తిచేశారు. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగంలో వాసవీ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాకేశ్ భవాని తెలుగు భాషపై ఉన్న మమకారంతో దూర విద్య ద్వారా బి.ఎ, ఎం.ఎలను పూర్తి చేసి యూజీసీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ద్వారా జేఆర్ఎఫ్˜ ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుల య్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ల పరీక్షలో ఓపెన్ కేటగిరీలో విజయం సాధించి డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడి పోస్టుకు ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు అనేక ప్రామాణిక వ్యాసాలు రాస్తున్నారు. రాకేశ్ భవాని తెలంగాణ జేఆర్ఎఫ్ స్కాలర్ల సంఘ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమంలో స్కాలర్ల తరపున చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ సీ.పీ.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సాంస్కతిక కార్యదర్శిగా పాతపెన్షన్ సాధన కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘానికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.