Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో
- పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం నాడు ఉద్యమ పార్టీగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు, త్యాగాలు, నిర్బంధాలు, అరెస్టులు, ఆత్మ బలిదానాలు చివరకు ఢిిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా చేస్తున్నారని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం శామీర్పేట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డిల ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని తెలిపారు. నవంబర్ 15న టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను పది లక్షల మందితో నిర్వహించే భారీ సభను విజయవంతం చేయడానికి ఇప్పటి నుండే కషి చేస్తామని తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో డిప్యూటీి మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు కె.సుభాష్నాయక్, కొల్తూరు మహేష్, బచ్చరాజు, మద్ది యుగేందర్రెడ్డి, అమర్సింగ్, కౌడే పోచయ్య, పిట్టల మల్లేష్, భీంరెడ్డి, నవీన్రెడ్డి, ఎన్.మధుసూదన్రెడ్డి, ఎంపల్ల అనంత్రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్గౌడ్, చిలుముల జగదీశ్వర్రెడ్డి, షేక్ ఇర్ఫాన్, పార్టీ నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, బైటింటి ఈశ్వర్రెడ్డి, యాసారం మహేష్, బొడిగే కష్ణాగౌడ్, లేతాకుల రఘుపతిరెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, తూముకుంట్ల శ్రీధర్రెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, బండి సతీష్గౌడ్, కుర్ర శ్రీకాంత్గౌడ్, అలువాల దేవేందర్గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ఖాన్, పట్టణ పెద్దలు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.