Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల దత్తనగర్, న్యూ ధాతు నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ మరియు ధాతునగర్ కాలనీలలో బాణోత్ సుజాత నాయక్ జీహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిశీలిస్తూ వాటిని పరిష్కారించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. న్యూధాతునగర్లో జరుగుతున్న డ్రయినేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందివ్వాలని జీహెచ్ఎంసీి అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు అశోక్రెడ్డి, మోహన్రెడ్డి, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ మారం శ్రీధర్, బీజేపీ నాయకులు బబ్లూగౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, సత్య ప్రకాష్సింగ్, తదితరులు పాల్గొన్నారు.