Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
ఎవరూ లేని సమయంలో ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అల్వాల్ పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 14వ తేదీన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్పేట అంజయ్య నగర్లో ఒక ఇంట్లో రూ.18 లక్షలా 50 వేలు దొంగతనం జరిగిందనే విషయంలో ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్టు అల్వాల్ సీఐ గంగాధర్ తెలిపారు. ఈ కేసును డీసీపీి, ఏసీపీ ఆధ్వర్యంలో అల్వాల్ గంగాధర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తమ సిబ్బందితో, నేర స్థలాల్లో సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా బుధవారం హస్మత్ పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు ఉప్పాడే జ్యోతి అలియాస్ ప్రేమ అలియాస్ విద్య, ఉప్పాడే రూప అనీ, వీరు బతుకుదెరువు నిమిత్తం గుల్బర్గా ముంబై నుంచి వచ్చి తుకారంగేట్, మంగార్ బస్తీలో నివాసముంటూ పేపర్ ఏరుకోవడం, వెంట్రుకలు తీసుకుని దానికి బదులుగా చిన్న చిన్న వంట సామాను ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉంటారని తెలిపారు. అయితే వీరికి కల్లు, మందు తాగడం వంటి దురలవాట్లకు బానిస కావడం వల్ల వారికి వచ్చే డబ్బులు సరిపోక పోవటంతో ఏదైనా దొంగతనం చేద్దాం అని నిర్ణయించుకుని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల చేశారనీ, ఆ విధంగా దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం అంజయ్యనగర్లో తాము ఏర్పాటు చేసిన సంతోష్ కుమార్ ఇంటిలోకి ప్రవేశించి బెడ్ రూమ్లోని బీరువాలో గల రూ.18 లక్షలా 50 వేలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి డబ్బులు పంచుకున్నారనీ, తర్వాత సుమారు రూ.10 లక్షలా 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు చేదించడంలో కృషి చేసిన అల్వాల్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ వైద్యనాథ్, కానిస్టేబుల్లు బాలకృష్ణ, కాషప్ప, సుధాకర్, రాజశేఖర్, నాగేందర్, మోహన్, ప్రవణ్య, మంగమ్మను ఉన్నతాధికారులు ప్రశంసించారని తెలిపారు.