Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
నవంబర్ 15వ తేదీన వరంగల్లో జరిగే టీఆర్ఎస్ విజయగర్జన సభను సక్సెస్ చేయాలని, తమ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఇక్కడి నైనా గార్డెన్లో నిర్వహించిన జనరల్బాడీ మీటింగ్లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లీనరీలో తమకు అప్పగిం చిన భోజనాల ఏర్పాట్లలో నియోజక వర్గానికి చెందిన కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణగా సేవలు అందించారన్నారు. విజయ గర్జన సభకు ప్రతీ డివిజన్కు బస్సులు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయని, సభను విజయవంతం చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యద ర్శులు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.