Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
అజాధికా అమత మహౌత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆర్మీ ఎంఈఎస్ ఆధ్వర్యంలో మడ్ ఫోర్డ్ నుంచి ప్యారడైస్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఎస్ అధికారులు మడ్ ఫోర్డ్లోని ఎంఈఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ జాతీయ ఐక్యత, దేశ సమగ్రతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉత్సవాలను జరపడం సంతోషకరమని తెలిపారు.