Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
దేశంలోనే లేని అత్యత్బుతమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తుందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని నైనా గార్డెన్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో తాము పని చేయడం పూర్వజన్మ అదృష్టం అన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ఎన్నో ఆధునిక వసతులతో అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుందన్నారు. అల్లాపూర్ డివిజన్ను ఆధునిక వసతులతో అభివృద్ధి పరుచుకున్నామన్నారు. వచ్చే నెలలో వరంగల్లో జరగబోయే మహగర్జన కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.