Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
నేరేడ్మెట్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా చెన్నారెడ్డిని నియమిస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చెన్నారెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీవగన్, డివిజన్ కార్యదర్శి మహత్య తదితరులు పాల్గొన్నారు.