Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లోని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. శుక్రవారం రాత్రి మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్లో కార్పొరేటర్ శ్రావణ్ స్థానిక ప్రజలతో పర్యటించి కాలనీలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీ వాసులకు వెంటనే సమస్య పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం అధికారులు స్ట్రీట్ లైట్స్ ఏఈ వెంకటేష్, మధు, వాటర్వర్క్ మేనేజర్ సతీష్, ఎస్ఎఫ్ఏ అంజయ్య, సేవరెజ్ సూపర్వైజర్ నాగరాజ్లతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయించారు. అలాగే డివిజన్ పరిధిలోని మొబైల్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు ప్రవీణ్కుమార్, కుమార్, దీప, భాస్కర్, బీజేపీ నాయకులు వినరు, సునీల్, జిలానీ, జై ఆనంద్, గన్న, వంశీ, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.