Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
జీహెచ్ఎంసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల్లో కోతలు విధించకూడదని సీఐటీయూ చాంద్రా యణగుట్ట జోన్ కార్యదర్శి ఎస్.కిషన్ డిమాండ్ చేశారు. సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కాంట్రక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చార్మినార్ జాయింట్ కమిషనర్ డీడీ నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు జీతాలు పెరగక, పీఆర్సీ వర్తింపచేయకపో వడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి రోజూ పనిచేసిన వారికి వచ్చే వేతనంలో కోతలు విధించడం దారుణం అన్నారు. సూపర్వైజర్లకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదనీ, కోతలు విధిస్తున్నారని తెలిపారు. రోడ్లు శుభ్రం చేయడానికి జాడు కట్టెలు, సేఫ్టీ పరికరాలు ప్రతినెలా అందించకపోవడంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలనీ, వేతనంలో కోతలు విధించకూ డదనీ, కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు.