Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
అవంతి కళాశాల ''డిగ్రీ ప్రదానోత్సవ'' కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం హట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ పప్పుల లక్ష్మినారాయణ్ హజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన ఉన్నత విద్యను అభ్యసిస్తూ సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఎంత ఉన్నత స్తాయికి ఎదిగినా ఒదిగి ఉండాలనే సూక్తిని పాటించినప్పుడే ఉత్తమ పౌరులుగా గుర్తించబడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీపీఐ సీఈఓ క్యాతి నారవానె, టీవీ-9 ఎంటర్టైన్మెంట్ హెడ్ ప్రేమ మాలిని వనం, ఎస్ఎస్వీ క్రిష్ణరావు, అవంతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎం. ప్రియాంక, మేనేజింగ్ డైరెక్టర్ ఐ.శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అథితులు ఎంవీఎస్ఎస్. నందీష్తోపాటు అవంతి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ హెచ్ఆర్ డాక్టర్ జయప్రద, ప్రిన్స్పాల్ వీర సోమయ్య, డాక్టర్ డి.వెంకట్ రావు, కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.