Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సంస్థ సభ్యులు, ప్రయివేటు స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్రెడ్డిని కలిసి వారు నిర్వహి స్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా చేస్తున్న సేవలను వివ రించారు. స్టూడెంట్స్కు నాణ్యమైన విద్యను అందించ డంలో భాగంగా మూడో తరగతి నుంచి పది స్కూల్ పిల్లలకు సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ పట్ల అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సంస్థ, ప్రయివేటు స్కూల్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉపాధ్యాయులు, టీచర్లను సత్కరించి సన్మానించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మీరు పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్య అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే తన వంతుగా వాటిని ప్రభుత్వం దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ రెడ్డి, చింతల రామచంద్ర టి.సత్య రెడ్డి, రాఘవ్, రాజు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.