Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
అన్నివర్గాల ప్రజల సంతోషమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్కు చెందిన 20 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. పేదింటి ఆడపడుచు వివాహం కోసం రూ.లక్షా 116 రూపాయలు ఆర్ధిక సాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అన్నారు. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే సీఎం సంకల్పంతో ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పంట పెట్టుబడుల కోసం రైతులు పడుతున్న అవస్థలను గుర్తించి రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి రూ.10వేలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకం క్రింద పెన్షన్లు అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్న గర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.