Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
వికలాంగుల పింఛన్లను రూ.3016 నుంచి రూ.6 వేలకు పెంచి నిరుద్యోగ వికలాంగులకు ప్రతి నెలా రూ.3వేల నిరుద్యోగ భృతితోపాటు పెండింగ్లో ఉన్న బ్యాక్లాక్ పోస్టులను భర్తీ చేయాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది దేఫ్ (డిఎస్డి) రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి భారతి డిమాండ్ చేశారు. శనివారం డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది దేఫ్ (డిఎస్డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట వికలాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భారతి మాట్లాడుతూ మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిప ˜ికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలన్నారు. 33 జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు ప్రభుత్వ ఔటు సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. వికలాంగులకు వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016 (ఆర్ పి డబ్ల్యూ డి) ప్రకారం 92 పూర్తిగా అవగా హన కల్పించాలన్నారు. మీసేవా, పంచాయతీ నెట్వర్క్లో విక లాంగులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. జిల్లాల్లో సైగల భాషలో ద్వారా ప్రత్యేక మూగ, చెవుడు స్కూల్ హాస్టల్ వసతి కల్పించాలన్నారు. బాధితులకు అన్ని టీవీ చానల్స్లో సైగల భాషను ద్వారా ప్రసారాలు ఏర్పాటు చేయాలన్నారు. ధరల పెరుగుదల కారణంగా వికలాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచాలన్నారు. ఆసరా పథకం కింద దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు కొత్త పింఛన్లను రూ.3016 గా మంజూరు చేసి ప్రతి వికలాంగుల కుటుంబానికీ అత్యధిక కార్డులు మంజూరు చేసి ఇంటి దగ్గరే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు, బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు త్రీవీలర్ పంపిణీ చేయాలనీ, ప్రతి బాధితునికీ నేర్చుకున్న వారికి 18 ఏండ్లు పైబడిన వారు అందరికీ ఉచితంగా 4జీ మొబైల్స్, ల్యాప్ టాప్ పంపిణీ చేయాలన్నారు. బోగస్ వికలాంగుల సర్టిఫికెట్ బోగస్ విద్యా సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గుర్తింపు పొందిన వికలాంగుల సంఘాలను మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించి తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. వెంటనే కలెక్టర్ స్పందించి వికలాంగుల సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.